ది ఇండియా న్యూస్7:స్పోర్ట్స్:-
హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు శనివారం దంబుల్లా వేదికగా జరిగిన తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్లో నిగర్ సుల్తానా నేతృత్వంలోని బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్స్కు చేరుకుంది. గత ఐదు మ్యాచ్ల్లో ఇది మూడో పది వికెట్ల విజయం. కేవలం 81 పరుగుల ఛేదనలో భారత ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన నిలకడగా ఆడి బంగ్లాదేశ్ పై విజయం సాధించారు కేవలం 11 ఓవర్లలోనే భారత్ 83 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. షెఫాలీ 28 బంతుల్లో 26 పరుగులు చేయగా, మంధాన 39 బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్స్తో 55 పరుగులు చేసి అజేయ అర్ధ సెంచరీ చేసింది. ఇద్దరు బ్యాటర్లు నాటౌట్గా నిలిచారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా రేణుకా ఠాకూర్ సింగ్ను ప్రకటించారు.అంతకుముందు టాస్ గెలిచిన నిగర్ సుల్తానా బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. రెగ్యులర్ ఇంటెరవేల్స్ లో వికెట్లు కోల్పోతూ ఉండటంతో బాటింగ్ యూనిట్ విఫలమైంది. బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా 51 బంతుల్లో 32 పరుగులు చేశాడు, మరే ఇతర బ్యాటర్ 20 పరుగుల మార్జిన్ను దాటలేకపోయారు. భారత్ తరఫున రేణుకా సింగ్, రాధా యాదవ్ చెరో 3 వికెట్లు తీయగా, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో వికెట్ తీశారు. ఆసియా కప్ మహిళల T20 2024 చివరి మ్యాచ్ జూలై 28న దంబులాలో జరుగుతుంది, ఇక్కడ శనివారం శ్రీలంక మరియు పాకిస్తాన్ మధ్య జరిగే రెండవ సెమీ-ఫైనల్ విజేతతో ఇండియా తలపడుతుంది.